దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 94,052 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 2,91,83,121 కు చేరుకుంది. మూడో రోజూ లక్షకంటే తక్కువుగానే కరోనా కేసులు నమోదవగా, వరుసగా 28వ రోజూ కూడా కొత్త కేసులకంటే రికవరీలు ఎక్కువుగా ఉన్నాయి. అలాగే కరోనాతో మరో 6148 మంది మరణించినట్టు తెలిపారు. అయితే బీహార్ రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్యను సవరించడంతో మరణాల సంఖ్యలో భారీ పెరుగుదల కనిపించింది. దీంతో దేశంలో మొత్తం మరణాల సంఖ్య 3,59,676 కు చేరుకుంది.
దేశంలో కరోనా రికవరీ రేటు 94.77 శాతం, మరణాల రేటు 1.23 శాతం:
ముఖ్యంగా తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, వెస్ట్ బెంగాల్, అస్సాం, తెలంగాణ, పంజాబ్ వంటి 10 రాష్ట్రాల్లోనే గత 24 గంటల్లో కొత్త కేసులు పెద్ద సంఖ్యలో నమోదు అయ్యాయి. ఇక దేశంలో ప్రస్తుతం 11,67,952 (4.00%) యాక్టీవ్ కేసులు ఉన్నాయి. మరో 1,51,367 మంది కరోనా నుంచి కోలుకోవడంతో, మొత్తం రికవరీల సంఖ్య 2,76,55,493 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 94.77 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.23 శాతంగా నమోదైంది.
దేశంలో కరోనా కేసులు వివరాలు (జూన్ 10, ఉదయం 8 గంటల వరకు):
- దేశంలో నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య: 37,21,98,253
- మొత్తం పాజిటివ్ కేసులు సంఖ్య : 2,91,83,121
- కొత్తగా నమోదైన కేసులు [జూన్ 9–జూన్ 10 (8AM-8AM)] : 94,052
- నమోదైన మరణాలు : 6148
- రికవరీ అయిన వారి సంఖ్య : 2,76,55,493
- యాక్టీవ్ కేసులు : 11,67,952
- మొత్తం మరణాల సంఖ్య : 3,59,676
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ