కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. ఇటీవల రోజువారీగా పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో కొత్తగా 30,203 కరోనా కేసులు, 115 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 40,57,233 కు చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 20,788 కి పెరిగింది. ఇక కొత్తగా కరోనా నుంచి 20,687 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 38,17,004 కు చేరుకుంది.
రాష్ట్రంలో ప్రస్తుతం 2,18,892 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇక కోజికోడ్ జిల్లాలో అత్యధికంగా 31462 యాక్టీవ్ కేసులు ఉండగా, మలప్పురంలో 30670, ఎర్నాకులంలో 28418, త్రిస్సుర్ లో 17090, తిరువనంతపురంలో 14470, కన్నూర్ లో 14094 కేసులు ఉన్నాయి. మరోవైపు మంగళవారం నాటికి కేరళలో 3,15,52,681 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ