దేశంలో కరోనా విజృంభణతో ఆగస్టు 4, మంగళవారం ఉదయానికి మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 18,55,745 కు చేరుకుంది. అలాగే కరోనా వైరస్ సోకి మరణించిన వారి సంఖ్య 38,938 కు చేరింది. కరోనా నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి. గత కొన్ని రోజులుగా పెద్ద సంఖ్యలో కేసులు నమోదవుతున్నప్పటికీ, కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అవుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతుంది. రాష్ట్రాలన్నీ టెస్టింగ్-ట్రాకింగ్-ట్రీట్మెంట్ విధానాన్ని అమలు చేస్తూ కరోనా నివారణకు ముమ్ముర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆగస్టు 4 నాటికీ దేశంలో మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఢిల్లీ రాష్ట్రాల్లో అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
దేశంలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదైన 5 రాష్ట్రాలు:
- మహారాష్ట్ర – 4,50,196
- తమిళనాడు – 2,63,222
- ఆంధ్రప్రదేశ్ – 1,66,586
- కర్ణాటక – 1,39,571
- ఢిల్లీ – 1,38,482
దేశంలో కరోనా మరణాలు ఎక్కువగా నమోదైన 5 రాష్ట్రాలు:
- మహారాష్ట్ర – 15,842
- తమిళనాడు – 4,241
- ఢిల్లీ – 4,021
- కర్ణాటక – 2,594
- గుజరాత్ – 2,504
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu