ఏపీలో మరో ఇద్దరు ఎమ్మెల్యే లకు కరోనా పాజిటివ్

Andhra Pradesh, AP Coronavirus, AP COVID 19 Cases, AP Total Positive Cases, Chirala MLA, Chirala MLA Karanam Balaram Tests Positive, Chirala MLA Karanam Balaram Tests Positive for Coronavirus, Corona Positive Cases, Coronavirus, Giddalur MLA, Giddalur MLA Anna Rambabu

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ ప్రభావంతో గత కొన్నిరోజులుగా పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు ఎమ్మెల్యేలు, కీలక నాయకులు సైతం కరోనా వైరస్ బారిన పడుతున్నారు. రాష్ట్రంలో మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్ గా తేలింది. ప్రకాశం జిల్లా, గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబుకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకోగా ఎమ్మెల్యే తో పాటుగా ఆయన సతీమణికి కూడా కరోనా పాజిటివ్ గా తేలింది. మిగతా కుటుంబ సభ్యులకు నెగెటివ్ గా నిర్ధారణ అయినట్టు సమాచారం.

అలాగే ప్రకాశం జిల్లా, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాంకు కూడా కరోనా సోకినట్లు తేలింది. ఆయన ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టుగా తెలుస్తుంది. ఇరువురు ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్ గా తేలడంతో గత కొన్నిరోజులుగా వారిని కలిసిన నేతలు, కార్యకర్తలకు కూడా పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. మరోవైపు ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 166586 కు చేరింది.

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − seven =