కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా విధించిన మూడో విడత లాక్డౌన్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం కొన్ని సడలింపులను ప్రకటించింది. దీంతో మే 12వ తేదీ నుంచి క్రమంగా ప్రయాణీకుల రైలు సర్వీసులను తిరిగి ప్రారంభించేందుకు రైల్వేశాఖ నిర్ణయించింది. మొదటి దశలో ఢిల్లీ నుంచి ప్రముఖ నగరాలకు 15 జతల రైళ్ళు(తిరుగు ప్రయాణాలతో కలిపి 30) నడపనున్నారు. ఈ రైళ్లు న్యూఢిల్లీ స్టేషన్ నుండి దిబ్రూఘడ్, అగర్తలా, హౌరా, పాట్నా, బిలాస్పూర్, రాంచీ, భువనేశ్వర్, సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నై, తిరువనంతపురం, మడ్గావ్, ముంబై సెంట్రల్, అహ్మదాబాద్, జమ్మూ తావీలను కలుపుతూ ప్రత్యేకంగా నడవనున్నాయి. ఇక వీటిలో మూడు రైళ్లు తెలుగు రాష్ట్రాల మీదుగా నడవనున్నాయి.
మే 12 నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా తిరిగే రైళ్ల జాబితా:
బెంగుళూరు-న్యూఢిల్లీ : శ్రీ సత్య సాయి ప్రశాంతి నిలయం, ధర్మవరం, అనంతపురం, గుంతకల్, సికింద్రాబాద్, కాజీపేట మీదుగా వెళ్తుంది. బెంగుళూరు నుంచి రాత్రి 8 గంటలకు, ఇక న్యూ ఢిల్లీ నుంచి రాత్రి 8:45 గంటలకు ఈ రైళ్లు బయలుదేరనున్నాయి. ఈ రైళ్లు ప్రతిరోజూ నడుస్తాయి.
న్యూఢిల్లీ- చెన్నైసెంట్రల్ : విజయవాడ, వరంగల్ మీదుగా వెళ్తుంది. న్యూఢిల్లీలో మధ్యాహ్నం 3:55 గంటలకు, చెన్నై సెంట్రల్ నుంచి ఉదయం 6.05 గంటలకు ఈ రైళ్లు బయలుదేరనున్నాయి. న్యూఢిల్లీ నుంచి బుధ, శుక్ర వారాల్లో, చెన్నై సెంట్రల్ నుంచి శుక్ర, ఆదివారాల్లో ఈ రైళ్లు నడవనున్నాయి.
న్యూఢిల్లీ-సికింద్రాబాద్ : కాజీపేట జంక్షన్ మీదుగా వెళ్తుంది… మే 17, ఆదివారం నాడు న్యూఢిల్లీ నుంచి మధ్యాహ్నం 3:55 గంటలకు బయలు దేరుతుంది. తిరిగి సికింద్రాబాద్ నుంచి మే 20, బుధవారం నాడు మధ్యాహ్నం 12:45 గంటలకు బయలుదేరుతుంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu