దేశంలో గ్యాస్ సిలిండర్ల ధర మరోసారి భారీగా పెరిగింది. ప్రభుత్వ యాజమాన్యంలో నడిచే గ్యాస్ మార్కెటింగ్ సంస్థలు డొమెస్టిక్ సిలిండర్ (14.2 కేజీ) ధర పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. డొమెస్టిక్ సిలిండర్పై ఈసారి 50 రూపాయలు పెంచారు. ఈ సవరించిన ధర ఫిబ్రవరి 15, సోమవారం నుంచే అమల్లోకి రానుంది. దీంతో ఎల్పీజీ సిలిండర్ రేటు ఢిల్లీలో రూ.769 కి పెరిగింది. కాగా ఫిబ్రవరిలో నెలలో సిలిండర్ ధరలు పెరగడం ఇది రెండోసారి. ముందుగా ఫిబ్రవరి 4 వ తేదీన నాలుగు ప్రధాన మెట్రో నగరాల్లో 25 రూపాయలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
మరోవైపు గత వారం రోజుల నుంచి దేశంలో వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరుగుతూనే ఉన్నాయి. సోమవారం నాడు పెట్రోల్ పై 26 పైసలు, లీటర్ డీజిల్ పై 29 పైసలు పెరిగింది. దీంతో హైదరాబాద్లో పెట్రోల్ ధర రూ.92.53/లీటర్, డీజిల్ ధర రూ.86.55/ లీటర్ కు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు గరిష్టస్థాయికి చేరుకుంటున్నాయి. వంటగ్యాస్, ఇంధన ధరలు ఇలా పెరుగుకుంటూ పోతుంటే రోజురోజుకి సామాన్యుడిపై భారం పెరుగుతుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ