దేశంలో కోవిడ్-19(కరోనా వైరస్) పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది. ఏప్రిల్ 18, శనివారం ఉదయానికి దేశవ్యాప్తంగా మొత్తం 14,378 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఈ వైరస్ వలన 480 మంది ప్రాణాలు కోల్పోయినట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. అలాగే ఈ వైరస్ తో పోరాడి 1991 మంది కోలుకుని డిశ్చార్జ్ అయినట్టుగా తెలిపారు. ఈ నేపథ్యంలో భారత నావికాదళంలో కూడా దాదాపు 20 నుంచి 26 మంది నేవీ సిబ్బందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు గుర్తించారు.
‘ఐఎన్ఎస్ ఆంగ్రే’కి చేరిన వీరంతా కరోనా వైరస్ సోకినప్పుడు ముంబై తీర ప్రాంత నివాస స్థావరాల్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. వీరిని ప్రస్తుతం ముంబయిలోని ఐఎన్హెచ్ఎస్ అశ్వినీ నేవీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు సమాచారం. భారత నావికాదళంలో మొదటిసారిగా కరోనా కేసులు వెలుగులోకి రావడంతో అప్రమత్తమైన అధికారులు వైరస్ సోకిన వారితో కలిసిన వారిని గుర్తించే ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే భారత ప్రభుత్వం ప్రకటించిన కోవిడ్-19 ప్రోటోకాల్ ప్రకారం కరోనా సోకినా వారు ఉన్న లివింగ్ బ్లాక్ ను, ఐఎన్ఎస్ ఆంగ్రే ను క్వారంటైన్-కంటైన్మెంట్ జోన్ కింద పరిగణిస్తూ అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు భారత నావికాదళం తెలిపింది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu