తెలంగాణ రాష్ట్ర రైతులకు శుభవార్త అందింది. రాష్ట్రంలో వానాకాలం సీజన్ కు సంబంధించి రైతుబంధు పంట పెట్టుబడి సాయాన్ని జూన్ 28వ తేదీ నుండి అర్హులైన రైతుల ఖాతాల్లో జమ చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో గతంలో మాదిరిగానే వరుస క్రమంలో తక్కువ విస్తీర్ణం కలిగిన రైతుల నుంచి మొదలుపెట్టి, ఎక్కువ విస్తీర్ణం కలిగిన రైతుల వరకు అర్హులైన రైతులందరి ఖాతాల్లో రైతుబంధు డబ్బులు జమకానున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY