మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పట్టింది. రోజువారీగా నమోదయ్యే పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో జూన్ 18, శుక్రవారం నాడు 9798 కరోనా కేసులు, 198 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 59,54,508 కి చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 1,16,674 కి పెరిగింది. ఇక కొత్తగా కరోనా నుంచి 14,347 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 56,99,983 కు చేరుకుంది.
రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 95.73 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.96 శాతంగా నమోదైంది. ప్రస్తుతం 1,34,749 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ముంబయిలో అత్యధికంగా 18764 యాక్టీవ్ కేసులు ఉండగా, పుణేలో 17888, థానేలో 13970, కొల్హాపూర్ లో 11453, సంగ్లీలో 10545 కేసులు ఉన్నాయి. మరోవైపు శుక్రవారం నాటికి మహారాష్ట్రలో 3,90,78,541 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ