మహారాష్ట్రలో మళ్ళీ కరోనా కేసులు పెద్దసంఖ్యలో నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం కొత్తగా 41,327 పాజిటివ్ కేసుల నమోదుకావడంతో మొత్తం కేసుల సంఖ్య 72,11,810 కి చేరింది. కరోనాకు చికిత్స పొందుతూ మరో 29 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,41,808 కు పెరిగింది. అదేవిధంగా కొత్తగా 40,386 మంది కరోనా నుంచి కోలుకోవడంతో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 68,00,900 కు చేరింది. ప్రస్తుతం మహారాష్ట్రలో 2,65,346 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.
మహారాష్ట్రలో కరోనా కేసుల వివరాలు (జనవరి 16, ఆదివారం నాటికీ):
- రాష్ట్రంలో నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య : 7,19,74,335
- రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య – 72,11,810
- డిశ్చార్జ్ అయినవారి సంఖ్య – 68,00,900
- కరోనా రికవరీ రేటు – 94.3%
- యాక్టీవ్ కేసులు – 2,65,346
- జనవరి 16న నమోదైన కేసులు – 41,327
- జనవరి 16న డిశ్చార్జ్ అయినవారు – 40,386
- జనవరి 16న నమోదైన మరణాలు – 29
- మొత్తం మరణాల సంఖ్య – 1,41,808
- కరోనా మరణాలు రేటు – 1.96%
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ