దేశంలో ముఖ్యంగా మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా తీవ్రత రోజురోజుకి పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఆగస్టు 2, ఆదివారం నాడు ఒక్కరోజే కొత్తగా 9509 కరోనా పాజిటివ్ కేసులు, 260 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,41,228 కి చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 15,576 కి పెరిగింది. ఇక కొత్తగా కోవిడ్ నుంచి 9926 మంది కోలుకోవడంతో డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 2,76,809 కి చేరింది. ప్రస్తుతం 1,48,537 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరోవైపు మహారాష్ట్రలో ఆగస్టు 2 నాటికీ 22,60,160 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu