మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. గతకొన్ని రోజులుగా కరోనా కేసులు, మరణాలు పెద్దసంఖ్యలో నమోదవుతున్నాయి. బుధవారం నాడు కూడా కొత్తగా 8807 కరోనా కేసులు, 80 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 21,21,119 కి చేరగా, మొత్తం మరణాల సంఖ్య 51,937 కు పెరిగింది. అలాగే కొత్తగా 2,772 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు కోలుకున్న కరోనా బాధితుల సంఖ్య 20,08,623 కు చేరింది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో, హోమ్ ఐసొలేషన్ లలో 59,358 మంది చికిత్స పొందుతున్నారు.
మహారాష్ట్రలో కరోనా కేసుల వివరాలు (ఫిబ్రవరి 24, బుధవారం నాటికీ):
- రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య – 21,21,119
- డిశ్చార్జ్ అయినవారి సంఖ్య – 20,08,623
- యాక్టీవ్ కేసులు – 59,358
- ఫిబ్రవరి 24 న నమోదైన కేసులు – 8,807
- ఫిబ్రవరి 24 న డిశ్చార్జ్ అయినవారు – 2,772
- ఫిబ్రవరి 24 న నమోదైన మరణాలు – 80
- మొత్తం మరణాల సంఖ్య – 51,937
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ