మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. ఇటీవల రోజువారీగా పెద్దసంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. మార్చి 10, బుధవారం నాడు కూడా 13659 కరోనా కేసులు, 54 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 22,52,057 కి చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 52,610 కి పెరిగింది. ఇక కొత్తగా కరోనా నుంచి 9,913 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 20,99,207 కు చేరుకుంది. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 93.21 శాతంగా ఉండగా, మరణాల రేటు 2.34 శాతంగా నమోదైంది. ప్రస్తుతం 99,008 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. మరోవైపు సోమవారం నాటికి మహారాష్ట్రలో 1,71,15,534 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ