ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్, సీఎం జగన్

2021 Maha Shivaratri, AP CM YS Jagan, CM Jagan Conveyed Maha Shivaratri Wishes to People, CM KCR, CM KCR and CM Jagan Conveyed Maha Shivaratri Wishes to People, CM KCR Conveyed Maha Shivaratri Wishes to People, CM KCR greets people for Shivaratri, Maha Shivaratri, Maha Shivaratri 2021, Maha Shivaratri In AP, Maha Shivaratri In Telangana, Mango News, Telangana CM KCR, Telangana Maha Shivaratri

తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి పర్వదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇరు రాష్ట్రాలలోని శివాలయాలు భక్తులతో పోటెత్తాయి. ఈ నేపథ్యంలో మ‌హాశివ‌రాత్రి ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. శివరాత్రి ఉపవాస పూజలను భక్తి ప్రపత్తులతో నిర్వహిస్తున్న భక్తులకు ఆ దేవదేవుని ఆశీర్వాదం ఎల్లవేళలా వుండాలని, తెలంగాణ ప్రజలకు సుఖసంతోషాలను శాంతిని ప్రసాదించాలని ఆ గరళకంఠుణ్ణి సీఎం కేసీఆర్ ప్రార్ధించారు.

“విశేష పూజలు, జాగరణతో ఓంకారస్వరూపుడైన శంకరుని ధ్యానించే పవిత్రమైన రోజు మహా శివరాత్రి. ఈ విశిష్ట పర్వదినాన ఆ పరమేశ్వరుని ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుతూ రాష్ట్ర ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు” అని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. మరోవైపు గుడివాడ మున్సిపల్‌ స్టేడియంలో నిర్వహిస్తున్న మహాశివరాత్రి ఉత్సవాల్లో సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − nine =