భారత్ లో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుండడంతో పాజిటివ్ కేసుల సంఖ్య 95 లక్షలకు చేరువైంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 36,604 కరోనా కేసులు, 501 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 94,99,413 కు, మరణాల సంఖ్య 1,38,122 కు చేరుకుంది. కాగా దేశంలో ప్రస్తుతం 4,28,644 మంది బాధితులు కరోనాకు చికిత్స పొందుతున్నారు
మరోవైపు కొత్తగా 43,062 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 89,32,647 కు చేరుకోగా, కరోనా రికవరీ రేటు 94.03 శాతంగా నమోదైంది. కరోనా మరణాల రేటు 1.45 శాతంగా ఉంది. ఇక డిసెంబర్ 1 నాటికీ దేశంలో14,24,45,949 కరోనా పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లోనే 10,96,651 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించినట్టు ఐసీఎంఆర్ వెల్లడించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ