ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూర్పుగోదావరి-పశ్చిమ గోదావరి, కృష్ణా-గుంటూరు స్థానాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు రేపు పోలింగ్ జరగనుంది. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. కాగా తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించిన చోట మధ్యాహ్నం 2 గంటల వరకే పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికలకు కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు.
ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులే ఎక్కువగా బరిలో నిలిచారు. ఏపీలోని అన్ని పార్టీలు ప్రత్యేకంగా అభ్యర్థులను ఎంపిక చేసి పోటీలో ఉంచలేదు. కాగా తూర్పుగోదావరి-పశ్చిమ గోదావరి స్థానంలో 11 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, 116 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ స్థానంలో మొత్తం 17,467 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అలాగే కృష్ణా-గుంటూరు స్థానంలో 19 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, 111 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ స్థానంలో మొత్తం 13,505 మంది ఓట్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ