మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. గత కొన్నిరోజులుగా రోజువారీ కరోనా కేసులు 30 వేలకు పైగానే నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న యాక్టీవ్ కరోనా కేసుల్లో 61 శాతానికిపైగా మహారాష్ట్రలోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మార్చి 31, బుధవారం కూడా 39,544 కరోనా కేసులు, 227 మరణాలు నమోదయ్యాయి.
దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 28,12,980 కి చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 54,649 కి పెరిగింది. ఇక కొత్తగా కరోనా నుంచి 23,600 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 24,00,727 కు చేరుకుంది. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 85.34 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.94 శాతంగా నమోదైంది. ప్రస్తుతం 3,56,243 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. మరోవైపు బుధవారం నాటికి మహారాష్ట్రలో 1,97,92,143 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ