దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి పూర్తిగా అదుపులోనే ఉంది. గత 24 గంటల్లో 150 లోపే కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా 131 పాజిటివ్ కేసులు నమోదవడంతో జనవరి 21, శనివారం ఉదయం 8 గంటల వరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,46,81,781 కు చేరుకుంది. అలాగే కరోనా వలన మరో 2 మరణాలు (ఉత్తర్ ప్రదేశ్ లో 1, కేరళలో రికాంసైల్డ్ 1) నమోదు కావడంతో, మొత్తం మరణాల సంఖ్య 5,30,730కి పెరిగింది. ఇక జనవరి 20న 1,59,607 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా, రోజువారీ పాజిటివిటీ రేటు 0.08 శాతంగా నమోదైంది.
దేశంలో 1,940 యాక్టీవ్ కరోనా కేసులు, రికవరీ రేటు 98.81 శాతం:
దేశంలో ప్రస్తుతం 1,940 యాక్టీవ్ కరోనా కేసులు ఉన్నాయి. ఇక కొత్తగా 135 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు దేశంలో కరోనా బారినపడి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 4,41,49,111 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.81 శాతంగా నమోదు కాగా, కరోనా మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. ముఖ్యంగా కేరళ (33), కర్ణాటక (29), మహారాష్ట్ర (14), పాండిచ్చేరి (11), పంజాబ్ (9) వంటి రాష్ట్రాల్లోనే రోజువారీ కరోనా కేసులు నమోదు కొంత ఎక్కువుగా ఉంది. కాగా దేశంలోని 22 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎలాంటి కొత్త కేసులు నమోదుకాలేదు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE