మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. డిసెంబర్ 12, శనివారం నాడు 4259 కరోనా కేసులు, 80 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 18,76,699 కి చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 48,139 కి పెరిగింది. ఇక కొత్తగా కోవిడ్ నుంచి 3,949 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 17,53,922 కు చేరుకుంది. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 93.46 శాతంగా ఉండగా, మరణాల రేటు 2.57 శాతంగా నమోదైంది. ప్రస్తుతం 73,542 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. శనివారం నాటికీ మహారాష్ట్రలో నిర్వహించిన కరోనా పరీక్షలు సంఖ్య 1,16,38,336 కు చేరుకుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ