జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ శనివారం నాడు కృష్ణా జిల్లాలో పర్యటించారు. గుడివాడ సమీపంలోని డోకిపర్రు గ్రామంలో వేంచేసిన శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామిని పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేదపండితులు పవన్ కళ్యాణ్ కు ఆశీర్వచనం అందజేసి, స్వామివారి తీర్ధ ప్రసాదాలను అందజేశారు. పవన్ కళ్యాణ్ వెంట జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, కృష్ణా జిల్లా జనసేన నాయకులు ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా ముందుగా గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని, అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా డోకిపర్రు గ్రామానికి పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ను చూసేందుకు అభిమానులు, జనసైనికులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ