మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో జూలై 27, సోమవారం ఒక్కరోజే కొత్తగా 7924 కరోనా పాజిటివ్ కేసులు, 227 కరోనా మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,83,723 కి చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 13,883 కి పెరిగింది. ఇక కొత్తగా కోవిడ్ నుంచి 8706 మంది కోలుకోవడంతో డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 2,21,994 కి చేరింది. ప్రస్తుతం 1,47,592 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరోవైపు మహారాష్ట్రలో జూలై 27 నాటికీ 19,28,333 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu