కరోనా వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో పలువురు ప్రజాప్రతినిధులు వైరస్ బారినపడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా టీపీసీసీ అధ్యక్షుడు, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. వైద్యుల సలహా మేరకు ప్రస్తుతం ఆయన హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 23, శుక్రవారం నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,87,106 కి చేరింది. ఇక కరోనా నుంచి 3,26,997 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 58,148 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ