మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పట్టింది. రోజువారీగా నమోదయ్యే పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో జూన్ 15, మంగళవారం నాడు 9350 కరోనా కేసులు, 388 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 59,24,773 కి చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 1,14,154 కి పెరిగింది. ఇక కొత్తగా కరోనా నుంచి 15,176 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 56,69,179 కు చేరుకుంది.
రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 95.69 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.93 శాతంగా నమోదైంది. ప్రస్తుతం 1,38,361 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. పుణేలో అత్యధికంగా 17623 యాక్టీవ్ కేసులు ఉండగా, ముంబయిలో 17519, థానేలో 14032, కొల్హాపూర్ లో 12949, సంగ్లీలో 10668 కేసులు ఉన్నాయి. మరోవైపు మంగళవారం నాటికి మహారాష్ట్రలో 3,84,18,130 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ