ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 15వ సీజన్ మార్చి 26 నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. మరో రెండ్రోజుల్లో సీజన్ ప్రారంభమవుతుండగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సంచలన నిర్ణయం తీసుకున్నాడు. కెప్టెన్సీ నుంచి తప్పుకుని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నాయకత్వ బాధ్యతలను ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు అప్పగించాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం గురువారం నాడు ట్విట్టర్ వేదికగా ప్రకటన చేసింది. 2012 నుంచి సీఎస్కేలో జడేజా అంతర్భాగంగా ఉన్నాడని, ధోనీ, సురేశ్ రైనా తర్వాత జట్టుకు నాయకత్వం వహించే మూడో ఆటగాడిగా నిలిచాడన్నారు.
ఇక ఎంఎస్ ధోని ఈ సీజన్తో పాటు ఆ తర్వాత కూడా సీఎస్కే జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నాడని పేర్కొన్నారు. మరోవైపు 2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి సీఎస్కే కెప్టెన్గా ధోని వ్యవహరిస్తున్నాడు. ధోని నాయకత్వంలో సీఎస్కే జట్టు 2010, 2011, 2018 మరియు 2021లో నాలుగు సార్లు ఐపీఎల్ టైటిల్ను గెలుచుకుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ