ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) పరీక్షను జూన్ 12న నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు టీఎస్ టెట్ నోటిఫికేషన్ ను పాఠశాల విద్యా శాఖ గురువారం నాడు విడుదల చేసింది. ఇందుకోసం మార్చి 26వ తేదీ నుంచి ఏప్రిల్ 12వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. పాఠశాలల్లో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం పరీక్షలు రాసేందుకు టెట్ పరీక్షలో అర్హత సాదించడాన్ని కేంద్రం తప్పనిసరి చేయడంతో రాష్ట్రప్రభుత్వాలు టెట్ పరీక్షను నిర్వహిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో 80,039 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీలో భాగంగా 13,086 సెకండరీ ఎడ్యుకేషన్ పోస్టులు భర్తీ చేయాలని తెలంగాణ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే ముందుగా టెట్ పరీక్ష నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమైంది. మరోవైపు టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) కు సంబంధించి అర్హత సర్టిఫికెట్ చెల్లుబాటు వ్యవధిని 7 సంవత్సరాల నుండి జీవితకాలం వరకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం గతంలోనే నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కూడా టెట్లో ఓసారి అర్హత సాధిస్తే జీవితకాలం చెల్లుబాటు అయ్యేలా విద్యాశాఖ తాజాగా మార్పు చేసింది. 2011 నుంచి టెట్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులందరికీ ఈ మార్పు వర్తించనుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మే-2016, జులై-2017 లలో టెట్ పరీక్ష నిర్వహించగా, తాజా నోటిఫికేషన్ మూడోది కానుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ