గోవా ముఖ్యమంత్రిగా ప్రమోద్ సావంత్ మార్చి 28న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. గోవా ముఖ్యమంత్రిగా సావంత్ రెండోసారి కొనసాగుతారని బీజేపీ సోమవారం ప్రకటించింది. ఆయన శాసనసభా పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మూడుసార్లు బిజెపి ఎమ్మెల్యేగా ఎన్నికైన సావంత్ గోవాలో శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన వెంటనే కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ పార్టీ సిద్దమయింది. శాసనసభా పక్ష సమావేశానికి బీజేపీ కేంద్ర పరిశీలకులు నరేంద్ర సింగ్ తోమర్, ఎల్ మురుగన్, అసెంబ్లీ ఎన్నికల ఇన్ఛార్జ్ దేవేంద్ర ఫడ్నవీస్, గోవా బీజేపీ చీఫ్ సదానంద్ షెట్ తనవాడే హాజరయ్యారు. కాగా సభా నాయకుడిగా డాక్టర్ ప్రమోద్ సావంత్ వ్యవహరించాలని నిర్ణయించినట్లు తోమర్ సమావేశం అనంతరం ప్రకటించారు.
ఇటీవల జరిగిన గోవా ఎన్నికలలో బీజేపీ 20 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. మెజారిటీ మార్కు 21 కాగా, ప్రభుత్వ ఏర్పాటుకు కేవలం ఒక్క సీటు మాత్రమే అవసరమైన నేపథ్యంలో.. ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు అలీక్సో రెజినాల్డో లౌరెన్కో, డాక్టర్ చంద్రకాంత్ షెట్యే మరియు ఆంటోనియో వాస్ బీజేపీకి తమ మద్దతును ఇదివరకే ప్రకటించారు. ఇద్దరు MGP సభ్యులు కూడా బీజేపీకే జై కొట్టారు. గోవాలో తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసిందిగా సావంత్ను గవర్నర్ పిఎస్ శ్రీధరన్ పిళ్లై ఆహ్వానించారు.గోవా ఎన్నికలలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ 11 అసెంబ్లీ స్థానాలను గెలుచుకోగా, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రెండు, రివల్యూషనరీ గోన్స్ పార్టీ మరియు గోవా ఫార్వర్డ్ పార్టీ ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్ను గెలుచుకోగలిగాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ