ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో శనివారం నాడు ఢిల్లీలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ భేటీ అయ్యారు. 7 లోక్ కళ్యాణ్ మార్గ్ లోని ప్రధాని నివాసంలో జరిగిన ఈ భేటీ దాదాపు గంటపాటుగా కొనసాగింది. అయితే భేటీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సమావేశం అనంతరం శరద్ పవార్ ట్వీట్ చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలుసుకున్నానని, జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చించినట్టు పేర్కొన్నారు. ఇటీవల ఎన్నికల స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ శరద్ పవార్తో రెండు సార్లు సమావేశమయ్యారు, అలాగే మహారాష్ట్రలో శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ ప్రభుత్వంలో విబేధాలపై వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు రెండు రోజుల ముందు ప్రధాని మోదీతో శరద్ పవార్ భేటీ కావడం ప్రాధానత్య సంతరించుకుంది. మరోవైపు రాబోయే రాష్ట్రపతి ఎన్నికలలో విపక్ష పార్టీల అభ్యర్థిగా బరిలో దిగుబోతున్నారంటూ తనపై వచ్చిన వార్తలను శరద్ పవార్ ఇప్పటికే తోసిపుచ్చారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ