జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మెయిన్ (జేఈఈ మెయిన్) 2023, తొలి విడత ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) మంగళవారం ఉదయం సెషన్ 1 ఫలితాలను విడుదల చేసింది. కాగా పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ jeemain.ntaలో తమ ఫలితాలను పొందవచ్చని సూచించింది. దీనికోసం వారు తమ అప్లికేషన్ నంబర్ మరియు డేట్ ఆఫ్ బర్త్ వివరాలను ఎంటర్ చేయాల్సి ఉంటుందని తెలిపింది. ఇక మెయిన్ 2023 ఫైనల్ ప్రొవిజనల్ ఆన్సర్ కీ ఫిబ్రవరి 6న (సోమవారం) విడుదల చేయబడింది. దేశవ్యాప్తంగా ఈ ఏడాది జనవరి జనవరి 24, 25, 28, 29, 30, 31 మరియు ఫిబ్రవరి 1 తేదీల్లో జేఈఈ మెయిన్ 2023 సెషన్ 1 పరీక్షలు నిర్వహించబడ్డాయి. ఈ పరీక్షలకు ఎనిమిదిన్నర లక్షల మందికి పైగా విదార్థులు హాజరయ్యారు. వీటిలో పేపర్ 1 (బీఈ/బీటెక్ కోర్సులు) పరీక్షను 8.22 లక్షల మంది రాయగా.. పేపర్ 2 (బీ.ఆర్క్/బీ.ప్లానింగ్) పరీక్షను లక్షల మంది విదార్థులు రాశారు.
జేఈఈ మెయిన్ 2023 సెషన్ 1 95.8 శాతంతో అత్యధిక హాజరును నమోదు చేసింది. ఈ ఏడాది జేఈఈని రెండు సెషన్లలో నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో జేఈఈ మెయిన్ 2023 రెండవ విడత ఏప్రిల్ 6, 8, 10, 11 మరియు 12 తేదీల్లో జరుగనుంది. పరీక్షకు రిజర్వ్ తేదీలు ఏప్రిల్ 13 మరియు 15 కాగా.. సెషన్ 2 రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఫిబ్రవరి 7 నుండి ప్రారంభమవుతుంది. కాగా తొలివిడతలో పరీక్ష రాసిన విద్యార్థులు కూడా ఈ సెషన్ 2 పరీక్ష రాయవచ్చు. ఇక తుది ఫలితాల అనంతరం ఎన్టీఏ ఆల్ ఇండియా ర్యాంకులు ప్రకటిస్తుంది. దీనిలో మొదటి 2.2 లక్షల మంది విద్యార్థులకు జేఈఈ అడ్వాన్సుడ్ పరీక్ష రాసేందుకు అనుమతి లభిస్తుంది. చివరిగా దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీలు, ట్రిపుల్ ఐటీలు, ఎన్ఐటీలు వంటి విద్యాసంస్థల్లో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇక అడ్మిషన్ల నిర్వహణ తేదీలను ఏప్రిల్ మూడో వారంలో విడుదల చేయవచ్చని ఎన్టీఏ వర్గాలు వెల్లడించాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE