దేశంలో కొత్త కరోనా వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఇప్పటివరకు 16 రాష్ట్రాల్లో మొత్తం 236 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదైనట్టు గురువారం ఉదయం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కాగా తాజాగా తమిళనాడులో గురువారం ఒక్కరోజే 33 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి మా సుబ్రమణియన్ ప్రకటన చేశారు. తాజా 33 కేసులతో తమిళనాడులో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 34 కు చేరుకుంది.
కొత్తగా నమోదైన 33 కేసులలో చెన్నైలో 26 మంది, మధురైలో నలుగురు, తిరువనామలైలో ఇద్దరు మరియు సేలంలో ఒకరు సేలంలో ఒకరు ఉన్నారని, అలాగే కేరళలోని ఓ ఆసుపత్రిలో ఒకరు చేరారని తెలిపారు. ఒమిక్రాన్ పాజిటివ్ గా తేలిన వీరి ఆరోగ్యం స్థిరంగా ఉందని, ఎలాంటి భయాందోళన అవసరం లేదని, అందరూ ఐసోలేషన్లో ఉన్నారని చెప్పారు. మరోవైపు ఒమిక్రాన్ నిర్ధారణకై జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపిన 23 మంది నమూనాల ఫలితాలు రావాల్సి ఉందని పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ