ప్రపంచ క్రికెట్లో అతి చురుకైన బుర్ర ఉన్న వాళ్లలో ఎంఎస్ ధోనీ ఒకడని టీమిండియా మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్ కొనియాడాడు. ధోనీ సమయస్ఫూర్తి, నిర్ణయాధికారం విషయాలలో అతడి సమకాలీన మేటి ఆటగాళ్లతో పోల్చితే ఎంతో ప్రత్యేకమని అన్నాడు. ప్రస్తుత కోచింగ్ విధానాలను చాపెల్ తప్పుబట్టాడు. భారత్లో సహజంగా కనిపించే గల్లీ క్రికెట్ సంస్కృతి.. విదేశాల్లో లోపించడం వల్లే మంచి ఆటగాళ్లు తయారు కాలేకపోవడానికి ఒక కారణంగా గ్రెగ్ చెప్పాడు. గత తరంలో గొప్ప క్రికెటర్లు వెలుగు చూశారంటే.. ఆటపై సహజంగా ఉండే ఆసక్తితో పాటు సీనియర్స్ నుంచి నేర్చుకోవడం వల్లేనని చాపెల్ అన్నాడు.
భారత ఉపఖండంలో ఇప్పటికీ కొన్ని పట్టణాల్లో కోచింగ్ సౌకర్యాలు అరుదు. కుర్రాళ్లు గల్లీల్లో, ఖాళీస్థలాల్లో ఎలాంటి కోచింగ్ లేకుం డా ఆడతారు. అలాగే ఎంతోమంది ఎదిగారు. వారిలో ధోనీ కూ డా ఒకడు. తనకంటే ఎక్కువ అనుభవం, భిన్నమైన ప్రాంతాల్లో ఆడడం వల్ల అతడు ఎంతో నేర్చుకున్నాడు. ఆటలో చురుగ్గా నిర్ణయాలు తీసుకొనే పరిజ్ఞానం.. సమకాలీనులతో పోల్చితే అతడిని ఎంతో భిన్నంగా చూపిస్తోందని చాపెల్ ప్రశంసించాడు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ