కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో కొత్తగా 46,387 కరోనా కేసులు, 32 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 55,10,844 కు చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 51,501 కి పెరిగింది. ఇక కొత్తగా కరోనా నుంచి 15,388 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 52,59,594 కు చేరుకుంది.
రాష్ట్రంలో ప్రస్తుతం 1,99,041 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇక తిరువనంతపురం జిల్లాలో అత్యధికంగా 48712 యాక్టీవ్ కేసులు ఉండగా, ఎర్నాకులంలో 31427, కోజికోడ్ లో 19704, త్రిస్సుర్ లో 19605, కొట్టాయంలో 12008, కొల్లంలో 11211, మలప్పురంలో 9955, పాలక్కాడ్ లో 9568 కేసులు ఉన్నాయి. మరోవైపు గురువారం నాటికి కేరళలో 4,28,29,322 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF