పాన్-ఆధార్ కార్డు అనుసంధానం చేసే విషయంలో కేంద్రప్రభుత్వం మరికొన్ని రోజులు అవకాశం కల్పించింది. పాన్ కార్డుతో ఆధార్ అనుసంధానం చేసే గడువును కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ముందుగా అనుసంధానం కోసం చివరితేదిని డిసెంబరు 31, 2019 గా ప్రకటించారు. అయితే ఈ రోజుతో గడువు ముగుస్తున్న నేపథ్యంలో మార్చి 31, 2020 వరకు పొడిగిస్తున్నట్టుగా ప్రకటించారు. ఈ సంవత్సరం ఏప్రిల్ లోనే పాన్- ఆధార్ అనుసంధానం కచ్చితంగా చేయాల్సిందేనని కేంద్రం ఉత్తర్వులు ఇచ్చింది. ఐటీ రిటర్నులు దాఖలు చేసే వారికీ అనుసంధానం తప్పనిసరి చేశారు. ఆధార్ అనుసంధానం చేయని పక్షంలో పాన్ కార్డు చెల్లదని ఐటీ శాఖ కూడా ప్రకటించింది. గతంలో సెప్టెంబర్లో నెలలో అనుసంధానం గడువును ఒకసారి పెంచిన కేంద్రప్రభుత్వం మరోసారి గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకోవడం విశేషం.
[subscribe]