పార్లమెంటు వర్షాకాల సమావేశాల నిర్వహణకు కేంద్రం సిద్దమవుతుంది. జూలై 18వ తేదీ నుంచి ఆగస్టు 12వ తేదీ వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. పార్లమెంట్ వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ మేరకు సిఫార్సు చేసినట్టు సమాచారం. ఈ సెషన్లో మొత్తం 17 రోజుల పాటుగా సమావేశాలను నిర్వహించాలని భావిస్తున్నారు. కాగా ఈ సమావేశాల్లోనే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి.
రాష్ట్రపతి ఎన్నికకు జూలై 18న ఓటింగ్, జూలై 21న కౌంటింగ్ నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రకటించగా, ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన అధికారిక షెడ్యూల్ ఇంకా ప్రకటించలేదు. అయితే ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పదవీకాలం ఆగస్టు 10వ తేదీనే ముగియనుండడంతో, ఉపరాష్ట్రపతి ఎన్నికలు కూడా ఈ సమావేశాల్లోనే జరిగే అవకాశం ఉంది. మరోవైపు 2022 శీతాకాల సమావేశాలు పార్లమెంట్ కొత్త భవనంలో జరుగుతాయని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఇప్పటికే పలు సందర్భాల్లో ప్రకటించిన నేపథ్యంలో ఈ వర్షాకాల సమావేశాలే ప్రస్తుత పార్లమెంట్ భవనంలో చివరి సెషన్ అయ్యే అవకాశం ఉంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY