భారతదేశం యొక్క జీ20 ప్రెసిడెన్సీ/అధ్యక్షతకి సంబంధించిన అంశాలను చర్చించడానికి శుక్రవారం గవర్నర్లు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన వీడియో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ, భారతదేశం యొక్క జీ-20 ప్రెసిడెన్సీ మొత్తం దేశానికి చెందినదని మరియు దేశం యొక్క బలాన్ని ప్రదర్శించడానికి ఇది ఒక ప్రత్యేకమైన అవకాశం అని పేర్కొన్నారు. ప్రధాని టీమ్ వర్క్ యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ, దేశంలో జరగనున్న వివిధ జీ-20 ఈవెంట్ల నిర్వహణలో రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల సహకారాన్ని కోరారు. జీ-20 ప్రెసిడెన్సీ దేశంలోని సాంప్రదాయ పెద్ద మెట్రో నగరాలను దాటి, దేశంలోని ఇతర ప్రదేశాలను/ప్రాంతాలను ప్రదర్శించడంలో సహాయపడుతుందని, తద్వారా మన దేశంలోని ప్రతి భాగం యొక్క ప్రత్యేకతను బయటకు తీసుకువస్తుందని పేర్కొన్నారు.
భారత్ యొక్క జీ-20 ప్రెసిడెన్సీ సమయంలో దేశానికి పెద్ద సంఖ్యలో సందర్శకులు వస్తున్నారని మరియు అంతర్జాతీయ మీడియా వివిధ కార్యక్రమాలపై దృష్టి సారిస్తుందని చెప్పారు. ఈ నేపథ్యంలో రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు తమను తాము ఆకర్షణీయమైన వ్యాపారం, పెట్టుబడి మరియు పర్యాటక గమ్యస్థానాలుగా రీబ్రాండ్ చేసుకోవడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. మొత్తం-ప్రభుత్వం మరియు మొత్తం-సమాజ విధానం ద్వారా జీ-20 ఈవెంట్లలో ప్రజల భాగస్వామ్యాన్ని నిర్ధారించాల్సిన అవసరాన్ని కూడా ప్రధాని పునరుద్ఘాటించారు.
ఈ సమావేశం సందర్భంగా పలు రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు మరియు లెఫ్టినెంట్ గవర్నర్లు తమ ఆలోచనలను పంచుకున్నారు, G20 సమావేశాలను సముచితంగా నిర్వహించడానికి రాష్ట్రాలు చేస్తున్న సన్నాహాలను వివరించారు. ఈ సమావేశంలో కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ప్రసంగిస్తూ, దేశానికి చెందిన ఒక జీ20 షెర్పా ప్రదర్శనను అందించారు. మరోవైపు ప్రధాని మోదీతో సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, రాష్ట్ర ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. దేశంలో జరగనున్న జీ20 సమావేశాల్లో భాగంగా ఏపీలోని విశాఖపట్నంలో ఫిబ్రవరి, ఏప్రిల్ నెలల్లో పలు సమావేశాలు జరగనున్నట్టు తెలుస్తుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE