తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్ లో నేటి (డిసెంబర్ 10, శనివారం) మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ కేబినెట్ సమావేశం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు, యాసంగి పంటకి రైతుబంధు నిధుల విడుదల, దళిత బంధు అమలు జరుగుతున్న తీరు, అలాగే సొంత జాగాలు ఉన్న బలహీన వర్గాలకు గృహ నిర్మాణం కోసం రూ.3 లక్షల ఆర్థికసాయం అంశం, రాష్ట్రం పట్ల కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న విధానం సహా పలు అంశాలపై చర్చించనున్నారు. కాగా మూడు నెలల అనంతరం రాష్ట్ర కేబినెట్ భేటీ జరుగుతుండడంతో రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, చేపట్టబోయే కార్యక్రమాలపై సుదీర్ఘంగా చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు సమాచారం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE