భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి శనివారం ఉదయం పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్ఎల్వీ)-సీ54 రాకెట్ ను విజయవంతంగా ప్రయోగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇస్రో మరియు న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఎస్ఐఎల్) లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఈ లాంచ్లో పాల్గొన్న అన్ని కంపెనీలను కూడా ప్రధాని మోదీ అభినందించారు. ఈ మేరకు ప్రధాని ట్వీట్ చేశారు.
“పీఎస్ఎల్వీ-సీ54 మిషన్ను విజయవంతంగా ప్రయోగించినందుకు ఇస్రో మరియు ఎన్ఎస్ఐఎల్ లకు అభినందనలు. ఈఓఎస్-06 ఉపగ్రహం మన సముద్ర వనరుల వినియోగాన్ని ఆప్టిమైజ్ చేయడంలో సహాయపడుతుంది. భారతీయ సంస్థలైన పిక్సెల్ స్పేస్ మరియు ధ్రువ స్పేస్ నుండి 3 ఉపగ్రహాల ప్రయోగం కొత్త శకానికి నాంది పలికింది. ఈ సందర్భంగా అంతరిక్ష సాంకేతికతలో భారతీయ ప్రతిభను పూర్తిగా గుర్తించవచ్చు. ఈ ప్రయోగంలో పాల్గొన్న అన్ని కంపెనీలకు మరియు ప్రతి ఒక్కరికీ అభినందనలు” అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE