బ్రెజిల్ లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వాకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది. “బ్రెజిల్లో అధ్యక్ష ఎన్నికలలో విజయం సాధించినందుకు లులా డా సిల్వాకి అభినందనలు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత లోతుగా మరియు విస్తృతం చేయడానికి, అలాగే ప్రపంచ సమస్యలపై సహకారం కోసం కలిసి పనిచేయడానికి నేను ఎదురుచూస్తున్నాను” అని ప్రధాని మోదీ పేర్కొన్నట్టు తెలిపారు.
బ్రెజిల్ లో అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు జైర్ బోల్సోనారో, లులా డా సిల్వా మధ్య హోరాహోరీగా పోటీ జరిగింది. 99 శాతానికి పైగా ఓట్లు పోలవ్వగా, లులా డా సిల్వాకు 50.9 శాతం ఓట్లు రాగా, బోల్సోనారోకు 49.1 శాతం ఓట్లు వచ్చాయి. అయితే గత మూడు దశాబ్దాల కాలంలో బ్రెజిల్ లో ఈ స్థాయిలో అతి తక్కువ తేడాతో ఫలితాలు వెలువడిన ఎన్నిక ఇదేనని తెలిపారు. ఓట్ల లెక్కింపు మొదట జైర్ బోల్సోనారో ముందంజలో ఉన్నపటికీ, చివర్లో లులా డా సిల్వా విజయంవైపు దూసుకెళ్లారు. గతంలో 2003 నుంచి 2010 వరకు బ్రెజిల్ అధ్యక్షుడిగా లులా డా సిల్వా పనిచేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE