ఉక్రెయిన్ లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న భారతీయ విద్యార్థులు, పౌరుల తరలింపుపై ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం కూడా ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులను పొరుగు దేశాలైన రొమేనియా, హంగరి, పోలాండ్, స్లోవాక్ రిపబ్లిక్ లకు తరలించి, అక్కడి నుంచి స్వదేశానికి తీసుకువస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. పోలాండ్, రొమేనియాకు ఇప్పటికే చేరుకున్న విద్యార్థులను తరలించడం సహా ఇతర భారతీయుల తరలింపును పర్యవేక్షించేందుకు నలుగురు కేంద్ర మంత్రులను ఉక్రెయిన్ పొరుగుదేశాలకు పంపాలని నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర మంత్రులు జ్యోతిరాద్దియా సింధియా, హర్దీప్ సింగ్ పూరి, కిరణ్ రిజిజు, కేంద్ర సహాయమంత్రి జనరల్ వీకే సింగ్ ఉక్రెయిన్ పొరుగుదేశాలకు వెళ్లనున్నారు.
జ్యోతిరాదిత్య సింధియా రొమేనియా, మాల్డోవాలో, కిరెన్ రిజిజు స్లోవాక్ రిపబ్లిక్ లో, హర్దీప్ సింగ్ పూరి హంగేరీలో, జనరల్ వీకే సింగ్ పోలాండ్లో భారతీయుల తరలింపు పక్రియను సమన్వయం చేయనున్నారు. సోమవారం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నలుగురు మంత్రులతో పాటుగా కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ ష్రింగ్లా, పలువురు సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ