మణిపూర్, మేఘాలయ మరియు త్రిపుర రాష్ట్రాల ప్రజలకు వారి రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. “మణిపూర్ ప్రజలకు రాష్ట్రావతరణ దినోత్సవ శుభాకాంక్షలు. గత కొన్ని సంవత్సరాలుగా రాష్ట్రం అనేక అంశాలలో పురోగమిస్తోంది. ఈ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని మరియు మణిపూర్ భారతదేశ అభివృద్ధి పథాన్ని బలోపేతం చేస్తూ ఉండాలని ప్రార్థిస్తున్నాను” ప్రధాని మోదీ పేర్కొన్నారు.
“రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా త్రిపుర ప్రజలకు శుభాకాంక్షలు. గత 5 సంవత్సరాలు త్రిపుర అభివృద్ధి పథంలో అద్భుతంగా ఉన్నాయి. వ్యవసాయం నుండి పరిశ్రమల వరకు, విద్య నుండి ఆరోగ్యం వరకు, రాష్ట్రం గొప్ప పరివర్తనను చూసింది. ఈ ధోరణి రాబోయే కాలంలో కూడా కొనసాగుతుంది” అని ప్రధాని అన్నారు. “మేఘాలయ ప్రజలకు వారి రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రాష్ట్రం దాని శక్తివంతమైన సంస్కృతికి, ముఖ్యంగా సంగీతం, కళ మరియు క్రీడల పట్ల మక్కువకు ప్రసిద్ధి చెందింది. మేఘాలయ ప్రజలు విభిన్న రంగాలలో రాణిస్తున్నారు. రాబోయే సంవత్సరాల్లో మేఘాలయ నిరంతరం పురోగమించాలని ప్రార్థిస్తున్నాను” ప్రధాని మోదీ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE