బీజేపీ సీనియర్ నేత, మాజీ ఉప ప్రధానమంత్రి లాల్ కృష్ణ అద్వానీ ఈ రోజు తన 95వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఎల్కే అద్వానీ బీజేపీ సహ వ్యవస్థాపకులలో ఒకరిగా ఉండడంతో పాటుగా ఎక్కువకాలం బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. కాగా ఎల్కే అద్వానీ పుట్టిన రోజును పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ఉదయం ఢిల్లీలోని ఎల్కే అద్వానీ నివాసానికి వెళ్లి, ఆయన్ను కలుసుకుని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అద్వానీతో ప్రధాని మోదీ కొద్దిసేపు ముచ్చటించారు. అద్వానీని కలిసిన వారిలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, పలువురు బీజేపీ నేతలు ఉన్నారు.
“అద్వానీ జీ నివాసానికి వెళ్లి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపాను. భారతదేశ వృద్ధికి ఆయన ఎంతో కృషి చేశారు. ఆయన విజన్ మరియు మేధస్సుకు భారతదేశం అంతటా గౌరవించబడ్డారు. బీజేపీని నిర్మించడంలో మరియు బలోపేతం చేయడంలో ఆయన పాత్ర అసమానమైనది. ఆయన దీర్ఘాయుష్షుతో ఆరోగ్యంగా జీవించాలని ప్రార్థిస్తున్నాను” అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
అలాగే కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా ట్వీట్ చేస్తూ, “అద్వానీ జీ ఒకవైపు తన నిరంతర కృషితో దేశవ్యాప్తంగా బీజేపీను బలోపేతం చేస్తూనే మరోవైపు ప్రభుత్వంలో ఉంటూ దేశాభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. ఆయన మంచి ఆరోగ్యంతో పాటు దీర్ఘాయుష్షు పొందాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను” అని పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE