కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం తుదిదశకు చేరుకుంది. దీంతో ప్రధాన పార్టీలన్నీ హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే అధికారంలో ఉన్న బీజేపీ మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని భావిస్తుండగా.. మరోవైపు కాంగ్రెస్ ఈసారి ఎలాగైనా అధికారం చేపట్టాలని ఉవ్విళ్లూరుతోంది. అలాగే ఇంకోవైపు మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి నేతృత్వంలోని జేడీఎస్ వీలైనన్ని ఎక్కువ స్థానాలు కైవసం చేసుకోవడమే ధ్యేయంగా ఎన్నికల బరిలో నిలిచింది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం బెంగళూరులో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) స్టార్ క్యాంపెయినర్గా ర్యాలీకి శ్రీకారం చుట్టారు. కర్ణాటక రాష్ట్ర రాజధాని అయిన బెంగళూరులో తమ అభ్యర్థులకు ఓటర్ల మద్దతును కూడగట్టేందుకు ప్రత్యేక వ్యూహంలో భాగంగా బీజేపీ ఈ కార్యక్రమం చేపట్టింది.
ఈ క్రమంలో మొత్తం 13 అసెంబ్లీ స్థానాల పరిధిలో ప్రధాని మోదీ మెగా రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ర్యాలీ 8 గంటల పాటు 26 కిలోమీటర్ల మేర సాగుతోంది. ఈ క్రమంలో ప్రధాని రోడ్ షోకు బీజేపీ కార్యకర్తలతో పాటు సామాన్య ప్రజలు భారీగా హాజరయ్యారు. జేపీ నగర్లో బీజేపీ కార్యకర్తలు పూల వర్షం కురిపిస్తూ ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికారు. రోడ్డుకు ఇరువైపులా నిల్చొని మోదీ.. మోదీ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. వారికి అభివాదం చేస్తూ ప్రధాని మోదీ ముందుకు సాగుతున్నారు. ఇక మరోవైపు కాంగ్రెస్ చివరి దశ ప్రచారంలో అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా చేరనున్నారు. కాగా కర్ణాటకలో జరుగనున్న 15వ అసెంబ్లీ ఎన్నికలు ఒకే దశలో మే 10వ తేదీన నిర్వహించనుండగా.. ఎన్నికల ఫలితాలు మే 13వ తేదీన ప్రకటించనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE