ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈరోజు (ఫిబ్రవరి 13, సోమవారం) ఉదయం బెంగళూరులోని యెలహంకలోని ఎయిర్ఫోర్స్ స్టేషన్లో ఏరో ఇండియా-2023 షో/14వ ఎడిషన్ను ప్రారంభించారు. ఏరో ఇండియా-2023 యొక్క థీమ్ “ది రన్వే టు ఎ బిలియన్ ఆపర్చునిటీస్” అని తెలిపారు. దాదాపు 100 విదేశీ, 700 భారతీయ కంపెనీలతో సహా 800 డిఫెన్స్ కంపెనీలతో పాటు 80కి పైగా దేశాలు ఇందులో పాల్గొంటాయి. ‘మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ద వరల్డ్’ అనే ప్రధాని దార్శనికతకు అనుగుణంగా, ఈ కార్యక్రమం స్వదేశీ పరికరాలు/సాంకేతికతలను ప్రదర్శించడం మరియు విదేశీ కంపెనీలతో భాగస్వామ్యాన్ని ఏర్పరచుకోవడంపై దృష్టి సారిస్తుందని తెలిపారు.
ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడుతూ, నవ భారతదేశం యొక్క సామర్థ్యాలకు బెంగళూరు ఏరో ఇండియా షో నిలువెత్తు నిదర్శనం అని అన్నారు. ఏరో ఇండియా 2023 భారతదేశం యొక్క పెరుగుతున్న సామర్థ్యాలకు ఒక ప్రకాశవంతమైన ఉదాహరణ అని మరియు ఈ ఈవెంట్లో 100 కంటే ఎక్కువ దేశాలు హాజరుకావడం మొత్తం ప్రపంచం భారతదేశంపై చూపుతున్న నమ్మకాన్ని తెలియజేస్తుందని ప్రధాని అన్నారు. ప్రపంచంలోని ప్రసిద్ధ కంపెనీలతో పాటు భారతీయ ఎంఎస్ఎంఈలు మరియు స్టార్టప్ లతో సహా 700 కంటే ఎక్కువ ఎగ్జిబిటర్లు పాల్గొనడాన్ని ప్రధాని వివరించారు ఏరో ఇండియా-2023 ‘ది రన్వే టు ఎ బిలియన్ ఆపర్చునిటీస్’ అనే థీమ్ ప్రధాని మాట్లాడుతూ, ఆత్మనిర్భర్ భారత్ పటిష్టం రోజురోజుకూ పెరుగుతోందని అన్నారు. ఈ ప్రదర్శనతో పాటు నిర్వహించబడుతున్న రక్షణ మంత్రి కాన్క్లేవ్ మరియు సీఈవోరౌండ్ టేబుల్ను ప్రస్తావిస్తూ, ఈ రంగంలో చురుకుగా పాల్గొనడం వల్ల ఏరో ఇండియా సామర్థ్యాన్ని పెంచుతుందని ప్రధాని అన్నారు.
భారతదేశ సాంకేతిక పురోగమనానికి కేంద్రంగా ఉన్న కర్ణాటకలో జరుగుతున్న ఏరో ఇండియా ప్రాముఖ్యతను ప్రధాని వివరిస్తూ, దీంతో విమానయాన రంగంలో కర్ణాటక యువతకు కొత్త దారులు తెరుచుకోనున్నాయని, దేశాన్ని బలోపేతం చేసేందుకు రక్షణ రంగంలో తమ సాంకేతిక నైపుణ్యాన్ని వినియోగించుకోవాలని కర్ణాటక యువతకు ప్రధాని పిలుపునిచ్చారు. ఎప్పుడైతే దేశం కొత్త ఆలోచనతో, కొత్త విధానంతో ముందుకు సాగుతుందో, అప్పుడు దాని వ్యవస్థలు కూడా కొత్త ఆలోచనకు అనుగుణంగా మారడం ప్రారంభిస్తాయన్నారు. ఏరో ఇండియా 2023 కొత్త భారతదేశం యొక్క మారుతున్న విధానాన్ని ప్రతిబింబిస్తుందని చెప్పారు. ఎయిరో ఇండియా ఒకప్పుడు ‘కేవలం షో’ అని, సెల్ టూ ఇండియాకి ఒక విండోగా ఉండేదని, అయితే ఇప్పుడు ఆ అభిప్రాయం మారిపోయిందన్నారు. నేడు, ఏరో ఇండియా భారతదేశం యొక్క బలం మరియు ఒక ప్రదర్శన మాత్రమే కాదు, ఇది రక్షణ పరిశ్రమ యొక్క పరిధిని ప్రదర్శించడమే కాకుండా భారతదేశం యొక్క ఆత్మవిశ్వాసాన్ని కూడా ప్రదర్శిస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE