జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన సర్పంచులతో ప్రధాని నరేంద్రమోదీ ఏప్రిల్ 24, శుక్రవారం నాడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ-గ్రామస్వరాజ్ పోర్టల్, మొబైల్ యాప్ లను ప్రధాని మోదీ ప్రారంభించారు. గ్రామాల్లో కరోనా వ్యాప్తి నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు, కరోనాపై అవగాహన కల్పించే అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు.
సర్పంచులతో ప్రధాని మోదీ నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్ ముఖ్యాంశాలు:
- కరోనా వైరస్ మనకు ఎన్నో పాఠాలు నేర్పింది. ఈ ప్రతికూల సమయంలో ఆత్మస్థైర్యంతో ఉండాలి. ఇతరులపై ఎక్కువగా ఆధారపడకూడదని, స్వయం సంవృద్థి అలవర్చుకోవాలని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
- దేశవ్యాప్తంగా కరోనా నివారణకు కృషి చేస్తున్న సర్పంచులకు ధన్యవాదాలు.
- కరోనా వైరస్ కట్టడిపై ప్రజలకు అవగాహన కల్పించాలి.
- లాక్డౌన్ సందర్భంగా పేదలకు సరిపడా ఆహార సదుపాయాలు అందించాలి.
- ప్రసుతం లక్షా 25వేల పంచాయతీల్లో బ్రాండ్ బ్యాండ్ సేవలు అందుతున్నాయి. త్వరలో అన్ని పంచాయతీలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తాం.
- స్థానిక ప్రజాప్రతినిధులంతా కలిసి గ్రామాల్లో విద్యుత్, రహదారులు, పారిశుద్ధ్యం మెరుగుకు చర్యలు చేపట్టాలి.
- గ్రామాల అభివృద్ధికి పంచాయతీరాజ్శాఖ ఎంతో కృషి చేస్తుంది.
- మంచి పనితీరు, అభివృద్ధి సాధించిన గ్రామ పంచాయతీలకు అవార్డులు అందజేస్తాం.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu