నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఉపవాస దీక్ష చేపట్టారు. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా లాక్డౌన్ విధించిన నేపథ్యంలో రాష్ట్రంలో రైతుల సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోవడంతో రైతులకు సంఘీభావంగా ఉపవాస దీక్ష చేపడుతున్నట్టు తెలిపారు. ఈ రోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు బండి సంజయ్ ఉపవాస దీక్ష చేపట్టనున్నారు.
ఈ ఉపవాస దీక్షలో భాగంగా కోర్ కమిటీ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, మండల అధ్యక్షులు, స్థానిక నాయకులు ఎవరి ఇంట్లో వారు దీక్ష చేపట్టాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. రైతులు ఎంతో కష్టపడి పండించుకున్న పంటకు గిట్టుబాటు ధర లభించక ఆందోళనకు గురవుతున్నారని సంజయ్ అన్నారు. దళారీ వ్యవస్థను ప్రోత్సహిస్తున్నారని, ఐకేపీ, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కనీస సౌకర్యాలు లేవని ఆయన విమర్శించారు. రైతు సమస్యలు తెలియాలంటే మంత్రులు క్షేత్రస్థాయిలో పర్యటించాల్సి అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu
[subscribe]