తిరుపతి నగరంలో నవంబరు 14వ తేదీన దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఉన్న నేపథ్యంలో నవంబరు 13, 14, 15వ తేదీల్లో తిరుమల శ్రీవారి ఆలయంలో బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఈ మేరకు టీటీడీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ కారణంగా నవంబరు 12, 13 14వ తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలకు ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవని తెలిపారు. అదేవిధంగా నవంబరు 13, 14, 15వ తేదీల్లో దాతలకు ఎలాంటి గదుల కేటాయింపు ఉండదని పేర్కొన్నారు. కావున భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించవలసిందిగా టీటీడీ విజ్ఞప్తి చేసింది.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన సదరన్ జోనల్ కౌన్సిల్ 29వ సమావేశం నవంబరు 14న తిరుపతిలో జరగనుంది. ఈ సమావేశ నిర్వహణకు ఏపీ ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్ధమవుతోంది. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, పుదుచ్చేరి నుంచి ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు. ఈ కీలక సమావేశ పరిస్థితుల దృష్ట్యానే తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ