నగరంలో వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి కేటిఆర్

Minister KTR Visits Flood Affected Areas, Heavy Rains In Hyderabad, Heavy rains lash Hyderabad, Hyderabad Rain Today, Hyderabad Rains, Hyderabad Rains news, Hyderabad records highest rainfall, Hyderabad Records Highest Rainfall in Last 24 Hours, Minister KTR, Minister KTR Review on Relief Measures, Telangana rains, telangana rains news, telangana rains updates

హైదరాబాద్ నగర చరిత్రలో కనీవినీ ఎరుగని స్థాయిలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. భారీ వర్షాల కారణంగా నగరంలోని అనేక ప్రాంతాలు వరద ముంపుకు గురయ్యాయి. ఈ నేపథ్యంలో వరద ముంపుకు గురైన ప్రాంతాలలో రాష్ట్ర హోం మంత్రి మహమ్మద్ అలీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డిలతో కలిసి రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటిఆర్ పర్యటిస్తున్నారు.

ఎల్బీనగర్ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని బైరామ‌ల్‌గూడ‌ ప్రాంతంతో పాటుగా రామంతాపూర్, హబ్సిగూడ పరిసర ప్రాంతాల్లో మంత్రి కేటిఆర్ పర్యటించి వ‌ర‌ద ప‌రిస్థితుల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో బాధితులతో మాట్లాడి, సహాయక చర్యలపై అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారు. ప్రభుత్వం తరఫున అన్నివిధాలుగా అండగా ఉంటామని ప్రజలకు ఈ సందర్భంగా మంత్రి కేటిఆర్ భరోసా ఇచ్చారు. ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొనాలని స్థానిక నాయకులకు మంత్రి కేటిఆర్ సూచించారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven − five =