ప్రధాని మోదీ ఫోటో లేకుండా వ్యాక్సిన్‌ సర్టిఫికెట్లు

త్వరలో ఎన్నికలు జరగనున్న.. గోవా, పంజాబ్‌, మణిపూర్‌, ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల ప్రజలు ఇకపై డౌన్‌లౌడ్‌ చేసుకునే కరోనా వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్లపై ప్రధాని మోదీ బొమ్మ కనిపించదు. ఆయా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు శనివారం ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించడంతో.. అమల్లోకి వచ్చిన ఎన్నికల నియమావళికి లోబడి చర్యలు తీసుకుంటామని వారు వెల్లడించారు. ఫిబ్రవరి 10 – మార్చి 7 మధ్య ఈ ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చింది. ఈ మేరకు.. కేంద్ర ఆరోగ్యశాఖ కోవిన్‌ యాప్‌లో ఈ మేరకు మార్పులు చేపడుతుందని అధికారులు వివరించారు.

సాధారణంగా, వాక్సిన్ వేయించుకున్న ప్రజలంతా కోవిన్‌ వెబ్‌సైట్‌ నుంచి కరోనా వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్లు తీసుకోవాలి. ఈ సర్టిఫికెట్ లో ప్రధాని మోదీ బొమ్మ ముద్రించి ఉంటుంది. అయితే, ఎన్నికల సంఘం సూచనల మేరకు.. ప్రస్తుతం ఆ ఐదు రాష్ట్రాల వరకు, జరీ చేసే సర్టిఫికెట్లపై ప్రధాని బొమ్మ కనిపించకుండా చేస్తామని కేంద్ర వర్గాలు తెలిపాయి. రాజకీయ పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో 2021 మార్చిలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లోనూ ఈసీ సూచన మేరకు ఆరోగ్య శాఖ ఇలాంటి చర్యలనే తీసుకుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen + thirteen =