ఏప్రిల్ 19న డబ్ల్యూహెఛ్ఓ గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్‌కు శంకుస్థాపన చేయనున్న పీఎం మోదీ

PM Narendra Modi will Visit Gujarat from April 18 to 20th, PM Narendra Modi will Visit Gujarat, Modi will Visit Gujarat from April 18 to 20th, PM Narendra Modi Gujarat Tour, Modi Gujarat Tour, Narendra Modi Gujarat Tour, PM Modi Gujarat Tour, PM Modi Gujarat Tour News, PM Modi Gujarat Tour Latest News, PM Modi Gujarat Tour Latest Updates, PM Modi Gujarat Tour For 2 Days, PM Modi, Narendra Modi, Prime Minister of India, Narendra Modi Prime Minister of India, PM Narendra Modi, Prime Minister Narendra Modi, Mango News, Mango News Telugu,

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏప్రిల్ 18 నుండి ఏప్రిల్ 20 వరకు గుజరాత్‌ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ గుజరాత్ లో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు,ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ముందుగా ఏప్రిల్ 18వ తేదీ సాయంత్రం 6 గంటలకు గాంధీనగర్‌లోని పాఠశాలలకు సంబంధించిన కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను ప్రధాని సందర్శించనున్నారు. ఏప్రిల్ 19వ తేదీ ఉదయం 9:40 గంటలకు బనస్కాంతలోని డియోదర్‌లోని బనాస్ డెయిరీ సంకుల్‌లో బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి జాతికి అంకితం చేయనున్నారు.

అలాగే ఏప్రిల్ 19 మధ్యాహ్నం 3:30 గంటలకు జామ్‌నగర్‌లో ఏర్పాటు చేస్తున్న వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెఛ్ఓ) గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్‌కు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ఇక ఏప్రిల్ 20వ తేదీ ఉదయం 10:30 గంటలకు గాంధీనగర్‌లో గ్లోబల్ ఆయుష్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఇన్నోవేషన్ సమ్మిట్‌ను ప్రధాని ప్రారంభిస్తారు. ఆ తర్వాత అదే రోజు మధ్యాహ్నం 3:30 గంటలకు దాహోద్‌లో జరిగే ఆదిజాతి మహా సమ్మేళనంలో పాల్గొని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనతో పాటుగా ప్రారంభోత్సవాలు చేయనున్నారు. మరోవైపు ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 4 =