ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏప్రిల్ 18 నుండి ఏప్రిల్ 20 వరకు గుజరాత్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ గుజరాత్ లో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు,ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ముందుగా ఏప్రిల్ 18వ తేదీ సాయంత్రం 6 గంటలకు గాంధీనగర్లోని పాఠశాలలకు సంబంధించిన కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ను ప్రధాని సందర్శించనున్నారు. ఏప్రిల్ 19వ తేదీ ఉదయం 9:40 గంటలకు బనస్కాంతలోని డియోదర్లోని బనాస్ డెయిరీ సంకుల్లో బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి జాతికి అంకితం చేయనున్నారు.
అలాగే ఏప్రిల్ 19 మధ్యాహ్నం 3:30 గంటలకు జామ్నగర్లో ఏర్పాటు చేస్తున్న వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెఛ్ఓ) గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్కు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ఇక ఏప్రిల్ 20వ తేదీ ఉదయం 10:30 గంటలకు గాంధీనగర్లో గ్లోబల్ ఆయుష్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్నోవేషన్ సమ్మిట్ను ప్రధాని ప్రారంభిస్తారు. ఆ తర్వాత అదే రోజు మధ్యాహ్నం 3:30 గంటలకు దాహోద్లో జరిగే ఆదిజాతి మహా సమ్మేళనంలో పాల్గొని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనతో పాటుగా ప్రారంభోత్సవాలు చేయనున్నారు. మరోవైపు ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ