కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా మే 17 వరకు విధించిన లాక్డౌన్ గడువు మరో ఐదు రోజుల్లో ముగియనుండటంతో ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి జాతినుద్దేశించి ప్రసంగించారు. కరోనా సంక్షోభంతో ప్రతికూల పరిస్థితులు నెలకున్న నేపథ్యంలో “ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్” పేరిట రూ.20లక్షల కోట్లతో ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రధాని మోదీ ప్రకటించారు. ఈ ప్యాకేజీ దేశ జీడీపీలో 10 శాతమని అన్నారు. అలాగే కొత్త నియమాలతో సరికొత్తగా మే 18 నుంచి లాక్డౌన్-4 ప్రారంభమవుతుందని, లాక్డౌన్-4 వివరాలను మే 18 వ తేదికంటే ముందే ప్రకటిస్తామని ప్రధాని మోదీ వెల్లడించారు.
ప్రధాని మోదీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు:
- ప్రపంచ వ్యాప్తంగా 42 లక్షల మందికి కరోనా వైరస్ సోకింది, దాదాపుగా 2 లక్షల 75 వేల మంది మరణించారు.
- కరోనా ఒక్కసారిగా ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది.
- భారతదేశంలో చాలా కుటుంబాలు కరోనావైరస్ వలన తమ ప్రియమైన కుటుంబ సభ్యులను కోల్పోయారు. వారందరికీ ప్రగాఢ సానుభూతి.
- ఈ వైరస్ నుంచి మనల్ని మనం రక్షించుకుని ముందుకు సాగాలి.
- స్వయం ఆధారిత భారతదేశంతో 21 వ శతాబ్దం భారతదేశానికి చెందిందని నిర్ధారణ చేసే బాధ్యత ఇప్పుడు మనపై ఉంది.
- ఈ సంక్షోభం భారతదేశానికి ఒక గొప్ప అవకాశాన్ని తెచ్చి పెట్టింది.
- కరోనా సంక్షోభం ప్రారంభమైనప్పుడు, భారతదేశంలో ఒక్క పిపిఈ కిట్ కూడా తయారు చేయబడలేదు. ఎన్-95 ఉత్పత్తి కూడా చాలా తక్కువ. ఈ రోజు పరిస్థితి భిన్నంగా ఉంది. భారతదేశం ప్రతిరోజూ 2 లక్షల పిపిఈ కిట్లు మరియు 2 లక్షల ఎన్-95 ముసుగులను ఉత్పత్తి చేస్తుంది.
- భారతదేశ విధానాలు, చర్యలు ప్రపంచ సంక్షేమంపై ప్రభావం చూపుతున్నాయి.
- మానవత్వ దృక్పధంతో భారతదేశం ఎంతకైనా నిలబడుతుందని ప్రపంచం విశ్వసించడం ప్రారంభించింది.
- భారతదేశం యొక్క 5 మూల స్తంభాలు -ఆర్థిక వ్యవస్థ, మౌలిక సదుపాయాలు, సాంకేతిక ఆధారిత వ్యవస్థ, శక్తివంతమైన జనాభా మరియు డిమాండ్.
- “ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్” పేరిట రూ.20 లక్షల కోట్లతో ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటిస్తున్నాం.
- ఈ ఆర్థిక ప్యాకేజీ మొత్తం దేశ జిడిపిలో 10 శాతం.
- కరోనాఫై పోరాడుతున్న సమయంలో ఈ ప్యాకేజీ ప్రజలకు ఎంతో చేయూత నిస్తుంది.
- ఈ ఆర్థిక ప్యాకేజీ గురించి రేపటినుండి ఆర్థిక శాఖ మంత్రి దేశానికి వివరిస్తారు.
- స్వావలంబన, ఆత్మవిశ్వాసం భారతదేశం యొక్క రెండు ఆయుధాలు. వీటికి సంబంధించిన అన్ని రంగాలకు ఈ ప్యాకేజీతో ప్రయోజనం ఉంటుంది.
- రోజువారీ కూలీలు మరియు తక్కువ ఆదాయం గల కుటుంబాలు, స్థానిక తయారీ యూనిట్లు, స్థానిక మార్కెట్లు మరియు సరఫరా వ్యవస్థకు ఈ ప్యాకేజి వలన ఉపయోగం ఉంటుంది.
- దేశీయ ఉత్పత్తిదారులు మరియు తయారీదారులకు మద్దతుగా దేశీయ ఉత్పత్తులను ప్రజలు కొనుగోలు చేయాలి.
- కరోనా వైరస్ చాలా కాలం మన జీవితంలో ఒక భాగమని శాస్త్రవేత్తలు అంటున్నారు. కానీ మన జీవితాలను కరోనా చుట్టూ పరిమితం చేయలేము.
- కరోనా ప్రభావం మనపై పడకుండా మాస్కులు ధరించి, భౌతిక దూరాన్ని పాటిస్తూ ముందుకు కొనసాగాలి.
- లాక్డౌన్-4 కొత్త నిబంధనలతో కొత్త రూపంలో ఉంటుంది.
- రాష్ట్రాల సూచనల ఆధారంగా, లాక్డౌన్-4 కి సంబంధించిన సమాచారం మే 18 లోపు ప్రజల ముందుకు తీసుకొస్తాం.
- లాక్డౌన్-4 కొత్త సంస్కరణలు మరియు నిబంధనలతో కూడి ఉంటుంది.
- కరోనాతో పోరాటం కొనసాగిస్తూ, మనమంతా ధైర్యంగా ముందుకు వెళ్ళాలి.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu