పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 7వ తేదీ నుంచి డిసెంబర్ 29వ తేదీ వరకు జరగనున్న విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం ‘భారత్ జోడో యాత్ర’ చేపడుతున్న కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు దూరం కానున్నట్టు తెలుస్తుంది. రాహుల్ గాంధీ ప్రస్తుతం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో భారత్ జోడో యాత్ర చేపడుతుండగా, కాంగ్రెస్ వెల్లడించిన షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 4 నుంచి రాజస్థాన్ రాష్ట్రంలోకి రాహుల్ గాంధీ యాత్ర ప్రవేశించనుంది. ఈ క్రమంలో పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనకుండానే భారత్ జోడో యాత్రను కొనసాగించాలని రాహుల్ గాంధీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అలాగే యాత్రకే ప్రాధాన్యత ఇస్తూ రాహుల్ తో పాటుగా ఎంపీలు జైరాం రమేష్, దిగ్విజయ్ సింగ్ లు, పార్టీకి చెందిన పలువురు సీనియర్ నేతలు కూడా పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు దూరమయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం.
మరోవైపు శనివారం సాయంత్రం కాంగ్రెస్ పార్లమెంటరీ స్ట్రాటజీ కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో అగ్రనేత సోనియా గాంధీ పాల్గొంటున్నారు. రాజ్యసభలో కాంగ్రెస్ ప్రతిపక్ష నేత ఎంపికతో పాటుగా పార్టీకి సంబంధించి పలు అంశాలపై చర్చలు జరపనున్నారు. కాంగ్రెస్ లో ‘ఒకే వ్యక్తి, ఒకే పదవి’ నియమంలో భాగంగా కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు పోటీచేసిన సమయంలో రాజ్యసభలో కాంగ్రెస్ ప్రతిపక్ష నేత పదవీకి మల్లిఖార్జున్ ఖర్గే రాజీనామా చేశారు. అయితే ఈ పదవీకి మరో నేతను ఎన్నుకుంటారా?, లేదా ఈ సమావేశాలకు మల్లిఖార్జున్ ఖర్గేనే కొనసాగిస్తారా? అనే అంశంపై సాయంత్రం జరిగే సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోనుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE